Flashmailnewsmedia
లో ఎంవోయూలు బయట జరుగుతాయి. ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళుతోంది, భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, ఎదురయ్యే సవాళ్లు, అందివచ్చే అవకాశాలపై మెయిన్ వెన్యూలో చర్చిస్తారు. కానీ వినూత్న పద్ధతిలో విశాఖ సమ్మిట్ కు మనం శ్రీకారం చుట్టాం. ఎవరికి ఏ సబ్జెక్ట్ పైన ఆసక్తి ఉంటే ఆ సెమినార్ కు వెళ్లే అవకాశం కల్పించాం. సమ్మిట్ లో వెన్యూ మొదలుకొని మెనూ వరకూ అంతా ప్లానింగ్ తో నిర్వహించారు. విదేశీ ప్రతినిధులను ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించింది. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మోదీ బలమైన నాయకుడు అనే భావన ప్రపంచమంతా ఉంది. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు పెట్టొచ్చనే ధైర్యాన్ని పారిశ్రామికవేత్తల్లో కలిగించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. విధ్వంస పాలనకు చరమగీతం పలికారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం.