Flashmailnewsmedia
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14 : ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇనిస్టిట్యూట్ ఫర్ డెమొక్రటిక్ ఎంగేజ్మెంట్ అండ్ ఎకౌంటబిలిటీ ఫౌండేషన్ (ఐడియా) ఆధ్వర్యంలో జాతీయ యూత్ పార్లమెంట్ నిర్వహించారు. ప్రారంభోత్సవ సభకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ నరసింహారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధులుగా దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి సూర్య ప్రకాష్ రావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.వీ.ఆర్.రాజు, విభాగాధిపతి ప్రొఫెసర్ పేటేటి ప్రేమానందం పాల్గుని జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. నరసింహారావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు వలన యువత రాజకీయాల్లో పాల్గొని దేశానికి మంచి సేవ చేసే అవకాశాలు లభిస్తాయని , ఆనాడు దేశ నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారని ,ఇప్పటి నాయకులలో అటువంటి విజ్ఞత కొరవడిందని పేర్కొన్నారు. లా యూనివర్సిటీ వి సి ప్రొఫెసర్ డి.సూర్య ప్రకాషరావు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమని , ఎన్ని ఉపద్రవాలు, అవంతరాలు వచ్చినా సజీవంగా పార్లమెంటు కొనసాగుతున్నదన్నారు. దానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని తెలియజేశారు. పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్ ఆచార్య పేటేటి ప్రేమానందం మాట్లాడుతూ పార్లమెంటరీ విలువలను, ఆనాడు నాయకుల త్యాగాలను వివరించారు. ఈ యంగ్ పార్లమెంట్ కార్యక్రమంలో స్పీకర్ గా పూజిత రెడ్డి, డిప్యూటీ స్పీకర్ గా అన్నెపు ఆదిత్య సాయి, పీ.ఎం.గా ఏనుగు ముఖేష్ సాయి, , కె.లావణ్య, నీలపు లలిత, మోదుగుల దివ్య జ్యోతి, రాయపూడి తెజశ్రీ, జి.హర్షవర్థన్, ఎన్.వికాస్ రెడ్డి, తదితరులు ప్రసంగిచ్చారు.