జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ సహచరులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ ఉపఎన్నికను నిర్వహించాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు
