భవానీ దీక్ష విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధా కృష్ణ వెల్లడించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నట్లు వివరించారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి దిగువన దుర్గ గుడి పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం దుర్గగుడి ఈవో శీనా నాయక్తో కలిసి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ విలేకర్లతో మాట్లాడారు.
