
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 21 : ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మెరీన్ లివింగ్ రిసోర్స్ డిపార్ట్మెంట్, అవంతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ *సంయుక్తంగా ఒక్కరోజు వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్.వై. కె రవికుమార్ మేనేజింగ్ డైరెక్టర్ వైశాకి మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ హాజరయ్యారు. ప్రొఫెసర్ కె. రమేష్ బాబు హెచ్. ఓ. డి, ప్రొఫెసర్ పి. ఏడుకొండలు, ప్రొఫెసర్ ఏ. కే. రెడ్డి, డాక్టర్ కె ఫణి ప్రకాష్, ఇతర టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రాముఖ్యతను, జీవరాశులను పరిరక్షించాలి, జీవనోపాధి, ప్రాణధారణ, పోషక భద్రతకు పునాది జీవన రక్షణ గురించి విద్యార్థులకు వివరించారు.
